ఏపీ రాజధాని అమరావతి నూతన రైలు మార్గం నిర్మాణ ప్రక్రియ...
- February 16, 2017
ఏపీ రాజధాని అమరావతి నూతన రైలు మార్గం నిర్మాణ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రైల్వే జీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన గురువారం గుంటూరు రైల్వే డివిజన్ పర్యవేక్షణకు వచ్చారు. పగిడిపల్లె వద్ద నుంచి ఆయన నాగిరెడ్డి పల్లె, చిట్యాల, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెన పల్లి, నల్లపాడు రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించి వంతెనల పటిష్టతను పరిశీలించారు. రైల్వే క్వార్టర్స్, నూతన ఆర్పీ ఎఫ్ భవనాన్ని ప్రారంభించారు. తనిఖీలు, ప్రారంభోత్సవాల అనంతరం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు-తెనాలి రెండో వరుస రైలు మార్గం పనులను 2018-19లో పూర్తి చేస్తామన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి నూతన మార్గం తొలి దశ 30 కిలోమీటర్ల నిర్మాణాన్ని ఏడిదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క రైలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరేకునేలా చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో ఎక్స్ప్రెస్ రైళ్ళ నిలుపుదల సౌకర్యం సాధ్యం కాదని, అయితే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









