హైదరాబాద్ చేరిన వంశీ మృతదేహం US నుంచి...
- February 16, 2017
వారం క్రితం క్రితం అమెరికాలో హత్యకు గురైన వంశీచంద్రెడ్డి మృతదేహం హైదరాబాద్కు చేరింది. అమెరికా నుంచి అర్థరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు డెడ్బాడీని తీసుకొచ్చారు. అక్కడ వంశీ మృతదేహానికి బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి నివాళులర్పించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు కిషన్రెడ్డి. బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలిపారు. ఎయిర్పోర్ట్ నుంచి మృతదేహాన్ని స్వగ్రామమైన హసన్పర్తి మండలం వంగ పహాడ్కు తరలించారు.
వంశీచంద్రెడ్డి MS చేసేందుకు అమెరికా వెళ్లాడు. సిలికాన్ వాలీలో చదువును పూర్తి చేసిన వంశీ... చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ స్టోర్లో విధులు ముగించుకొని రూమ్కు బయలుదేరాడు. ఈలోపు ఓ దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. వంశీ వెంటనే కుప్పకూలిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
డ్రగ్స్, జాత్యాంహకారంతోనే వంశీపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడ్ని కూడా అరెస్ట్ చేశారు. వంశీ మరణవార్తతో వంగపహాడ్లో విషాదం అలుముకొంది. కొడుకు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. అండగా ఉంటాడుకున్న కొడుకు అర్థాంతరంగా తనువు చాలించాడంటూ కన్నీరుమున్నీరయ్యారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









