హైదరాబాద్‌ చేరిన వంశీ మృతదేహం US నుంచి...

- February 16, 2017 , by Maagulf
హైదరాబాద్‌ చేరిన వంశీ మృతదేహం US నుంచి...

వారం క్రితం క్రితం అమెరికాలో హత్యకు గురైన వంశీచంద్‌రెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరింది. అమెరికా నుంచి అర్థరాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు డెడ్‌బాడీని తీసుకొచ్చారు. అక్కడ వంశీ మృతదేహానికి బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు కిషన్‌రెడ్డి. బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి మృతదేహాన్ని స్వగ్రామమైన హసన్‌పర్తి మండలం వంగ పహాడ్‌కు తరలించారు. 
వంశీచంద్‌రెడ్డి MS చేసేందుకు అమెరికా వెళ్లాడు. సిలికాన్‌ వాలీలో చదువును పూర్తి చేసిన వంశీ... చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ స్టోర్‌లో విధులు ముగించుకొని రూమ్‌కు బయలుదేరాడు. ఈలోపు ఓ దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. వంశీ వెంటనే కుప్పకూలిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. 
డ్రగ్స్‌, జాత్యాంహకారంతోనే వంశీపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడ్ని కూడా అరెస్ట్‌ చేశారు. వంశీ మరణవార్తతో వంగపహాడ్‌లో విషాదం అలుముకొంది. కొడుకు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. అండగా ఉంటాడుకున్న కొడుకు అర్థాంతరంగా తనువు చాలించాడంటూ కన్నీరుమున్నీరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com