ఒకేరోజు 24 మంది ఉగ్రవాదులు హతం..
- February 17, 2017
ఇస్లామాబాద్: ఓ ప్రార్థనాలయంలో ఉగ్రవాది చొరబడి ఆత్మాహుతితో 76 మందిని బలితీసుకున్న తెల్లారే.. పాకిస్తాన్ భద్రతా దళాలు శుక్రవారం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించాయి. మొత్తం 24 మంది మిలిటెంట్లను కాల్చి చంపాయి. ఒక్క దక్షణ ప్రావిన్సులోనే 18 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పారామిలటరీ సింద్ రేంజర్స్ శుక్రవారం వెల్లడించింది. సింధ్లోని సూపర్ హైవే వద్ద సైనిక కాన్వాయ్పై కాల్పులకు తెగబడిన మరో ఏడుగురు ఉగ్రవాదులు కూడా హతమైనట్టు రేంజర్స్ పేర్కొంది. కరాచీలో మంఘోపిర్ వద్ద జరిపిన సోదాల్లో 11 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్టు తెలిపింది. మరోవైపు ఖైబర్-పక్తున్ఖవాలో పోలీసులు ప్రత్యేకంగా జరిపిన ఆపరేషన్లో మరో 11 మంది తీవ్రవాదులు హతమయ్యారు.
రెగ్గీ ప్రాంతంలో ముగ్గురు, పెషావర్లో నలుగురు, బన్ను ప్రాంతంలో మరో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారని ఓ సీనియర్ భద్రతాధికారి వెల్లడించారు. తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోందనీ... ముందు ముందు మరిన్ని విస్తృత దాడులు చేస్తామని ప్రకటించారు. కేవలం వారం రోజుల్లోపు ఎనిమిది సార్లకు పైగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడడంతో పాకిస్తాన్ ప్రభుత్వం సోదాలకు ఆదేశించినట్టు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







