హెలికాప్టర్ కెమెరాలు సైబరాబాద్లో...
- February 17, 2017
కొనుగోలుకు పోలీసుల కసరత్తు
పలు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు సైబరాబాద్ పోలీసుల అమ్ముల పొదిలో హెలికాప్టర్ కెమెరాలు చేరబోతున్నాయి. సైబర్ సిటీ భద్రత దృష్ట్యా ఈ కెమెరాలను కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. హెలికాప్టర్ కెమెరాల ద్వారా ఐటీ కారిడార్పై డేగకన్ను వేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. హెలికాప్టర్ కెమెరాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో గచ్చిబౌలి కమిషనరేట్లో శుక్రవారం సంప్ర దింపులు జరిపారు. వాటి పనితీరు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం తదితర విషయాలు చర్చకు వచ్చినట్టు విశ్వస నీయంగా తెలిసింది.
కంపెనీల ప్రతినిధులు వాటి పనితీరుపై డెమో కూడా ఇచ్చారు. అత్యాధునిక కెమెరాల గురించి పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం.
ధర 75 లక్షలు
అత్యాధునిక హెలికాప్టర్ కెమెరాల ధర భారీగా ఉన్నట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి. ఒక్కోదానికి రూ. 75 లక్షల మేర ఖర్చవుతోందని కంపెనీల ప్రతినిధులు సమావేశంలో పేర్కొ న్నారు. బడ్జెట్ను బట్టి వాటిని త్వరలో కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలిసింది. ట్రాఫిక్ రద్దీ, నేరగాళ్ల కదలికలను హెలికాప్టర్ కెమెరాల ద్వారా సులువుగా పసిగట్టవచ్చని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









