1000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందుకున్న మున్సిపాలిటీ
- February 18, 2017
మనామా: వరదలు..వర్షం నీరుకి సంబంధించి 1000 పైగా ఫిర్యాదులు నార్త్ గవర్నటే కు గత రెండు రోజులలో వచ్చినట్లు నివేదించారు.సార్, ఆలీ, హమద్ టౌన్ మరియు ఇతర ప్రాంతాలలో సహా గవర్నరేట్ లోని వివిధ ప్రాంతాల్లో పౌరులు మరియు నివాసితుల ద్వారా ఈ పిర్యాదులు చేశామని తెలిపారు ఉత్తర ఏరియా మున్సిపాలిటీ డైరెక్టర్ యూసీఫ్ అల్ ఘటం నిర్ధారించారు.1500 కంటే ఎక్కువ ట్యాంకులు వర్షం నీటిని తోడివేయడం జరిగిందని మరో 26 నీటి ట్యాంకర్లు జెబ్లాట్ హబిషి , సల్మాబాద్, ఆలీవంటి మరియు రౌండ్ అబౌట్ 22 సమీపంలోని హమద్ టౌన్ ప్రాంతాల్లో నుండి నిలువ ఉండిపోయిన వర్షం నీటిని సేకరించినట్లు తెలిపారు.పురపాలక సంఘం యొక్క అత్యవసర జట్లు ఈ సమస్య అధిగమించేందుకు ప్రధానిశ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఆదేశాల ప్రకారం ఈ పనిని వేగవంతంగా పూర్తిచేసినట్లు అల్ ఘటం పేర్కొంది.బహ్రెయిన్ మరియు అరేబియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల అస్థిర వాతావరణం పరిస్థితులు ద్వారా ప్రభావితం చేయబడ్డాయి. గత వారం ప్రారంభంలో నమోదు వర్షపాతం సాధారణ స్థితిని మించి కురిశాయని ఇది 17 క్యూబిక్ మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా, కానీ గత రెండు రోజులలో వర్షపాతం 80 క్యూబిక్ మిమీ ని దాటిపోయిందని ఆ అధికారి చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 24 గంటలు విధుల్లో నిమగ్నమై ఉంటామని, ఆయా ప్రజల సహకారంతో సమస్య అధిగమించడానికి ప్రాముఖ్యతని ఇస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







