'ఎయిర్ ఏషియా' వారి సరికొత్త ఆఫర్
- February 18, 2017
విమాన ప్రయాణీకుల కోసం ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా సరికొత్త ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,099కే విమాన టికెట్ను అందించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 19 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 30, 2017 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. గువహటి-ఇంఫాల్ మధ్య ప్రయాణించే వారికి మాత్రమే రూ.1,099కి టికెట్ లభించనుంది. కోచి-బెంగళూరు, బెంగళూరు హైదరాబాద్ల మధ్య రూ.1,449, గోవా-బెంగళూరు రూ.1,599, విశాఖపట్నం-బెంగళూరు రూ.1,699లుగా టికెట్ ధరలు ఉన్నాయి. అయితే ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయో సంస్థ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







