ఖతార్‌ 2022 స్టేడియంలో మాడ్యులర్‌ సీటింగ్‌ ఏర్పాటు

- February 18, 2017 , by Maagulf
ఖతార్‌ 2022 స్టేడియంలో మాడ్యులర్‌ సీటింగ్‌ ఏర్పాటు

తొలి మాడ్యులర్‌ సీటింగ్‌ ఎలిమెంట్స్‌ని అల్‌ ఖోర్‌ సిటీలోని అల్‌ బాయెట్‌ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఖతార్‌ 2022 వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ కోసం ఈ స్టేడియం ముస్తాబవుతోంది. గ్రౌండ్‌ లెవల్‌ నుంచి 39 మీటర్ల ఎత్తులోనూ అల్‌ బాయెట్‌ స్టేడియం స్టాండ్స్‌ స్పష్టంగా కన్పిస్తున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2022 ఫిఫా వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్స్‌ ఈ స్టేడియంలో జరుగుతాయి. 60,000 మంది వీక్షించేలా ఈ స్టేడియంని డిజైన్‌ చేయడం జరిగింది. సంప్రదాయ అరేబియన్‌ టెంట్‌ పద్ధతిలో దీన్ని నిర్మించారు. తొలి దఫాలో 2,500 సీట్లను నార్త్‌ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో, అత్యంత సుందరంగా స్టేడియం నిర్మితమవుతున్నట్లు అల్‌ బాయెట్‌ స్టేడియం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాజర్‌ అల్‌ హజెరి చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com