స్మార్ట్ ఫోన్ల ఛాటింగ్ వల్ల అనారోగ్యాలు
- February 18, 2017
స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో రాత్రిపూట నిద్ర చాలామందికి కరువైంది. పనుల్ని చక్కబెట్టుకుని నిద్రకు ఉపక్రమించే ముందు సోషల్ మీడియా, ఛాటింగ్ వంటివి చేస్తూ వాటితో గంట గంటలు గడిపేస్తున్నారు. దీంతో నిద్ర తగ్గుతోంది. టెక్నాలజీ పెరగడం వలన పని ఎంత వేగవంతం అయిందో దాని వలన కలిగే హాని కూడా అంతే వేగం అయింది.
ముఖ్యంగా యువత, సాఫ్ట్ వేర్ జాబర్స్ సోషల్ మీడియాకు అలవాటుపడి సరైన నిద్రకు దూరమవుతున్నారు. దీంతో అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. చాలామంది ఎక్కువగా చాట్ చేస్తూ, లేదా సినిమాలు చూస్తూ టైం తెలియకుండా రాత్రి నిద్రపోకుండా గడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువగా పెరుగుతుంది.
రాత్రి ఎప్పుడో నిద్రపోయి ఉదయానే లేచి స్టూడెంట్స్ అయితే హడావిడిగా కాలేజ్కి, ఉద్యోగులు ఆఫీసులకు రెడీ అయి వెళ్తుంటారు. ఇలాంటి వారికి రానున్న రోజుల్లో చాలా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యువత కనీసం 7-9 గంటలు, టీనేజర్స్ 8-10 గంటలు, చిన్న పిల్లలు అయితే 11-14 గంటలు నిద్రపోవాలని వైద్యులు చెప్తున్నారు. అందుకే నిద్రపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. కనీసం రోజుకి 7 గంటలు నిద్రపోకపోతే.. ఒబిసిటీ తప్పదంటున్నారు.
నిద్రకు ఉపక్రమించడానికి మూడు గంటల ముందు వ్యాయామం చేస్తే హాయిగా నిద్రపోవచ్చు. పడుకొనే ముందు కాఫీ, టీ లాంటివి తాగవద్దు. గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. అంతేకానీ ఫోన్లకు అలవాటు పడితే అనారోగ్య సమస్యలు తప్పవని, డయాబెటిస్, ఒబిసిటీ వంటి ఇతరత్రా సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









