సరిహద్దులో పాకిస్తాన్ ఫిరంగులు
- February 21, 2017
ఉగ్రవాదులపై పోరును ఉధృతం చేసిన పాకిస్తాన్ తాజాగా అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో భారీ ఫిరంగులను మొహరించినట్లు తెలిసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా ఈ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా సోమవారం చెప్పారు. పాక్లో గతవారం జరిగిన వివిధ ఉగ్రదాడుల్లో 100 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇటీవల జరిగిన దాడులకు బాధ్యులైన ఉగ్రవాద సంస్థ అఫ్గానిస్తాన్ నుంచే కార్యకలాపాలు సాగిస్తోందని పాకిస్తాన్ అంటోంది. పాక్ భద్రతా దళాలు 130 మందికి పైగా ఉగ్రవాదులను గతవారంలో హతమార్చాయి.
సింద్ రాష్ట్రంలోని సెహ్వాన్లో సూఫీ మత గురువు లాల్ షాబాజ్ ఖలందర్ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన మానవబాంబు దాడిలో 80 మంది మరణించగా, మరో 250మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేతపై పాకిస్తాన్ పోరాటాన్ని ఉధృతం చేసింది. 130 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 350 మందిపైగా అరెస్ట్ చేసింది. వీరిలో అత్యధికులు అఫ్గానిస్తాన్ పౌరులు ఉండడంతో సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఛమన్, తొర్కామ్ జిల్లాల్లో సరిహద్దు వెంబడి భారీ సంఖ్యలో ఫిరంగులు మొహరించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









