సమాధిలోంచి జయ ఆత్మను రప్పిస్తా..
- February 21, 2017
తమిళనాడు రాజకీయాలపై వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మళ్ళీ స్పందించాడు. శశికళ పై సినిమా తీస్తానని ఇదివరకే ప్రకటించిన వర్మ..పళని స్వామి, పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న రాజకీయ నాటకంతో సమాధిలో ఉన్న జయలలిత ఆత్మ శాంతిస్తుందా అని ప్రశ్నించాడు. తమిళనాడు హారర్ పాలిటిక్స్ కి బెస్ట్ క్లైమాక్స్ ఆలోచించానని, ఈ నాటకాన్ని తట్టుకోలేక జయ ఆత్మ సమాధి నుంచి బయటకు రావడమే తన సినిమాలో క్లైమాక్స్ అని ట్వీట్ చేశాడు.
బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళ..తానేమైనా చిల్లర దొంగనా అని చేసిన వ్యాఖ్యపై స్పందించిన వర్మ-అసలైన నేరం ఎవరిదన్నాడు. బతకడంకోసం ఓ 600 రూపాయలు దొంగిలించిన వాడిదా లేక తమ విలాసవంతమైన జీవితం కోసం తమపై ఎంతో నమ్మకం ఉంచిన ప్రజల్ని కూడా మోసం చేసి 60 కోట్లు కొట్టేసిన దొంగలదా అని అన్నాడు.
కనీసం 60 కోట్లు ఎలా కొట్టేశారో శశికళ నుంచి వీళ్ళు (చిల్లర దొంగలు) పాఠం నేర్చుకోవాలని కోరాడీ ట్వీట్ల మాష్టారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







