బహ్రెయిన్లో ముగ్గురు కార్మికులు మృతి
- February 22, 2017
మనామా: ముగ్గురు వలసదారులు పొగ పీల్చడం కారణంగా మృతి చెందారు. జిదాఫ్స్లోని అకామడేషన్లో ఈ ముగ్గురూ మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. తాహిర్ ఫరూక్, బినూ కుమార్, హజి మొహమమ్మద్ మృతి చెందగా, మరొక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఎస్ఎంసి ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. గొడౌన్లో వారు నిద్రపోతుండగా, పొగ కారణంగా ఊపిరాడక ఆ ముగ్గురూ చనిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాసిఫ్ కన్స్ట్రక్షన్లో తాహిర్ ఫరూక్ పనిచేస్తున్నారు. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన మంతు కుమార్, అదే సంస్థలో పనిచేస్తున్నాడు. బినూకుమార్ భారతదేశానికి చెందిన వ్యక్తి. మిగతా ఇద్దరి జాతీయత గురించి వెల్లడి కావాల్సి ఉంది. చలి కారణంగా వెచ్చదనం కోసం చార్కోల్ని మండించగా, దాన్నుంచి వచ్చిన పొగ ముగ్గుర్ని బలి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితులకు సహాయం అందించేందుకు ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ సంసిద్ధంగా ఉన్నట్లు కో-ఆర్డినేటర్ జాన్ ఫిలిప్ చెప్పారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









