బహ్రెయిన్లో ముగ్గురు కార్మికులు మృతి
- February 22, 2017
మనామా: ముగ్గురు వలసదారులు పొగ పీల్చడం కారణంగా మృతి చెందారు. జిదాఫ్స్లోని అకామడేషన్లో ఈ ముగ్గురూ మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. తాహిర్ ఫరూక్, బినూ కుమార్, హజి మొహమమ్మద్ మృతి చెందగా, మరొక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఎస్ఎంసి ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. గొడౌన్లో వారు నిద్రపోతుండగా, పొగ కారణంగా ఊపిరాడక ఆ ముగ్గురూ చనిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాసిఫ్ కన్స్ట్రక్షన్లో తాహిర్ ఫరూక్ పనిచేస్తున్నారు. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన మంతు కుమార్, అదే సంస్థలో పనిచేస్తున్నాడు. బినూకుమార్ భారతదేశానికి చెందిన వ్యక్తి. మిగతా ఇద్దరి జాతీయత గురించి వెల్లడి కావాల్సి ఉంది. చలి కారణంగా వెచ్చదనం కోసం చార్కోల్ని మండించగా, దాన్నుంచి వచ్చిన పొగ ముగ్గుర్ని బలి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితులకు సహాయం అందించేందుకు ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ సంసిద్ధంగా ఉన్నట్లు కో-ఆర్డినేటర్ జాన్ ఫిలిప్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







