రూ.49లకే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌

- February 23, 2017 , by Maagulf
రూ.49లకే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌

రూ.49లకే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌
రూ.243కి అన్‌లిమిటెడ్‌ బ్రాడ్‌బాండ్‌
టెలిఫోన్‌ రంగంలో నెలకొంటున్న పోటీ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ అరుదైన అవకాశాన్ని ప్రకటించినట్లు ఎస్‌డీఈ ప్రకాష్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ రూ.49లకే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ అందిస్తున్నామన్నారు.రూ.243లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అన్‌ లిమిటెడ్‌ బ్రాండ్‌ బాండ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. మార్చి 31వతేదీ వరకు ఏ విధమైన రిజిస్ట్రేషన్‌ చార్టీలు ఉండవని, ఈ అవకాశాన్ని ప్రజలంతా అందిపుచ్చుకోవాలన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఇప్పటికే కల్పించగా, ప్రతి నెలలో వచ్చే అన్ని ఆదివారాలు పూర్తి ఉచితం చేశామన్నారు.
సమావేశంలో జేటీవో సువర్ణ వర్మ, రాజానగరం జేఈ శరత్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com