ఉగ్రవాద శిభిరంలో చేరిన ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష

- February 28, 2017 , by Maagulf
ఉగ్రవాద శిభిరంలో చేరిన ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష

మనామా:సరయ అల్ అష్టర్  (అల్ అష్టర్ బ్రిగేడ్స్) ఉగ్రవాద శిభిరం వలలో చిక్కుకొన్న ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష ఖాయమైంది. అంతే కాకుండా ఈ ముగ్గురు వ్యక్తులలో ఇద్దరి బహ్రేయినీ జాతీయతని స్వాధీనం చేసుకొన్నారు. మొదటి ,రెండవ వ్యక్తుల ప్రతివాదుల జాతీయతని రద్దు చేసి 15 సంవత్సరాలు , ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. మూడవ ప్రతివాదికి మూడు సంవత్సరాల పాటు కారాగారంలో ఉచాలు లెక్కపెట్టేలా శిక్ష విధించబడింది. సరయ అల్ అష్టర్ బ్రిగేడ్స్ ఉగ్రవాద సంస్థ పోలీసు అధికారులే  లక్ష్యంగా అనేక దాడులకు బాధ్యత కలిగి ఉన్నారు. 2014 లో డయ్య పేలుడులో ముగ్గురు పోలీసు అధికారులు హత్య కేసులో  కూడా వీరి ప్రమేయం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com