తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి: కవిత
- February 28, 2017
తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్లో మంగళవారం నిర్వహించిన ఎన్ఆర్ఐ టీఆర్ఎస్యూకే కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్సెల్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేశారని గుర్తుచేశారు.
ప్రస్తుతం బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్ఆర్ఐలకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, ఉపాధ్యక్షుడు దూసరి అశోక్, నవీన్రెడ్డి, శ్రీకాంత్, రత్నాకర్, సత్యం రెడ్డి, ప్రవీణ్కుమార్, కిరణ్రెడ్డి, శ్రీధర్రావు, మీడియా ఇన్చార్జి శ్రీకాంత్, యూకే ఇన్చార్జి విక్రమ్రెడ్డి, ఐటీ సెక్రటరి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









