మహేష్ బాబు తరుపున భారీ విరాళం అందజేసిన నమ్రత ఊరి కోసం...
- March 01, 2017
హైదరాబాద్: ఊరికోసం ఏదైనా చేయాలనే కాన్సెప్టుతో వచ్చిన మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా తర్వాత గ్రామాలను దత్తత తీసుకోవడం, ఊరి బాగు కోసం మంచి చేయడం లాంటివి చాలా మంది ఆచరిస్తున్నారు. మహేష్ బాబు కూడా స్వయంగా దీన్ని ఆచరిస్తూ... అభిమానులు తన దారిలో నడిచేలా చేస్తున్నాడు.
శ్రీమంతుడు సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంతో పాటు తెలంగాణలో సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పనులను మహేష్ బాబు సతీమణి నమ్రత చూసుకుంటన్నారు.
తాజాగా నమ్రత రూ.30 లక్షలను నాట్కో ట్రస్టు ద్వారా సిద్దాపురం లో అభివృద్ధి పనుల కోసం అందజేసారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు చెక్ ను అందజేశారు..
రూ. 30 లక్షలను గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు గ్రామాలను సంబంధించిన అభివృద్ధి పనులను నమ్రత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత సౌమ్యుడో అందరికీ తెలిసిందే. వివాదాలకు ఆయన వీలైనంత దూరంగా ఉంటారు. తాజాగా మహేష్ బాబు ఓ వివాదానికి మద్దతు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు మహేష్ బాబు సతీమణి నమ్రత. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







