ఎమ్మెల్యేలకు ఇంద్రభవనాలు నిర్మించనున్న కేసీఆర్

- March 01, 2017 , by Maagulf
ఎమ్మెల్యేలకు ఇంద్రభవనాలు నిర్మించనున్న కేసీఆర్

తన అధికార నివాసానికి దాదాపు 50 కోట్లతో నిర్మించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు కూడా అదే తరహాలు విలాసవంతమైన భవనాలు నిర్మించ తలపెట్టారు.  ఎమ్మెల్యేలందరికీ స్థానికంగా అధికార నివాసాలుంటే ప్రజలకు అందుబాటులో ఉంటారని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.  ఒక్కో ఎమ్మెల్యే కోటి రూపాయల చొప్పున నిధులు ఉపయోగించుకుని ఇల్లు నిర్మించుకోవచ్చు.  అయితే హైదరాబాదులో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్ళకు స్థలాలు లభించనందున అవి ప్రస్తుతానికి పక్కన పెట్టి జిల్లాల్లో 104 ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులను నిర్మిస్తోంది.  ఇవి మరో ఆరు నెలల్లో పూర్తికానున్నాయి.  రెండు అంతస్థుల్లో నిర్మించే ఈ అధికారిక నివాసంలో పై అంతస్థులో ఎమ్మెల్యే వ్యక్తిగతంగా వాడుకునేలా ఏర్పాటు చేస్తున్నారు.  కింద ప్లోర్‌లో అధికారిక సమావేశాలు, ప్రజలతో సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com