'బాహుబలి 2' ఆడియో వేడుకకు సన్నాహాలు
- March 02, 2017
'బాహుబలి 2' సినిమాకి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ రాపిడ్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షను మార్చి 28వ తేదీన ఘనంగా నిర్వహించాలని చిత్రయూనీట్ ప్లాన్ చేస్తోంది. మొదటి భాగానికి చెందిన ఆడియోను తిరుపతిలో ఆవిష్కరించారు. దాంతో రెండవ భాగానికి చెందిన ఆడియోను వైజాగ్ లో రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
కానీ ఈ సినిమా కోసం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన 'మాహిష్మతి రాజ్యం' సెట్లోనే ఆడియో వేడుకను జరపాలని రాజమౌళి ఆలోచిస్తూన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం వేసిన సెట్స్ ను చూసే అవకాశాన్ని చాలామందికి కల్పించడం కోసమే రాజమౌళి ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరపడానికి ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. అదే వేదికను ఫిక్స్ చేస్తారేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







