ఖతార్ వచ్చే కార్మికులకు ఎలక్ట్రానిక్ ఒప్పందాలు
- September 22, 2015
ఖతర్ వచ్చే కార్మికుల కోసం ఎలక్ట్రానిక్ ఒప్పందాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖతార్లో ఈ విధానం తొలిసారిగా అమలు చేయబడనుంది. మార్చ్ 2016 నాటికి అమలు చేయాలని యోచిస్తున్నట్లు కార్మిక, సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మహమ్మద్ అలీ అల్ మీర్ చెప్పారు. కార్మికులు వారి హక్కుల గురించి తెలుసుకోవడానికి ఈ విధానం ఉపయోగపడనుంది. కొత్త వ్యవస్థ ద్వారా కార్మికులు ప్రభుత్వ వెబ్సైట్ని యాక్సెస్ చెయ్యగలగడం, వారి పేరు లేదా ఐడి లేదా వీసా నంబర్ వంటి వాటి ద్వారా వారి ఒప్పందాల వివరాల్ని వీక్షించగలరని ఆయన చెప్పారు. వారి సొంత భాషల్లో ఒప్పందాల వివరాల్ని తెలుసుకునే వీలుంటుంది. నేపాల్, ఉర్దూ సహా పది భాషలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుడుతున్నారు. 1.7 మిలియన్ విదేశీ కార్మికులు ఖతార్లో నివసిస్తుండగా, వారు వివిధ ఒప్పందాల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 2020 నాటికి రెండు మిలియన్ల కన్నా ఎక్కువ మంది విదేశీ కార్మికులు ఖతర్లో నివసిస్తారనేది ఓ అంచనా. 2013, జూన్లో ఈ విలువ 42 బిలియన్ దిర్హామ్లుగా వుంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి







