ముందస్తు జీతాల చెల్లింపు లేనట్టే
- September 22, 2015
ఈద్ అల్ అదా కోసం ముందస్తుగా జీతాల చెల్లింపు అవసరం లేదని మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. జీతాల చెల్లింపు తేదీ, ఈద్కి దగ్గరలో ఉంది గనుక, ప్రత్యేకంగా ముందస్తు జీతాల చెఇaల్లంపు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగం వ్యవధి తక్కువ ఉండటంతో ముందస్తు జీతాల చెల్లింపుపై నిర్ణయం తీసుకోలేదనీ, సెలవుల వ్యవధి తక్కువ ఉండటమే దీనికి కారణమని చెప్పారు. అయితతే అధికారిక ప్రకటన ముందస్తు జీతాలను ఆశిస్తున్నవారిని నిరాశపరిచింది. మహమ్మద్ ఫైసల్ అనే వ్యక్తి, ఈద్ అల్ అదా కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలనుకున్నామనీ, ఈ నిర్ణయం తమను నిరాశపరిచిందనీ, తమ ప్రణాళికల్ని మానుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతి సంవత్సరం ముందే జీతాలు చెల్లించేలా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునేదనీ, ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందని ఆశించినట్లు ఆయన వివరించారు. ప్రైవేటు కంపెనీల ప్రతినిథి ఒకరు, అధికారిక ప్రకటనను స్వాగతించారు. చాలా కంపెనీలకు నిధులు నెలాఖరుకు సమకూరుతాయి గనుక, ముందస్తు చెల్లింపులు ఇబ్బందికరంగా మారతాయని ఆయన చెప్పారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







