విలన్గా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నిర్మాత
- March 04, 2017
తెలుగు, తమిళ చిత్రాలను నిర్మంచిన రాక్లైన్ వెంకటేష్ విలన్గా రానున్నారు. 'లింగ' నష్టాల వ్యవహారంలో పంపిణీదారులు విలన్గా భావించిన నిర్మాత రాక్లైన్ వెంకటేష్ నిజంగానే విలన్గా మారారు. బాలా తెరకెక్కిస్తున్న 'నాచ్చియార్' చిత్రంలో ఆయన విలన్గా నటిస్తున్నారు. బాలా చిత్రాలను మొదటి నుంచి పరిశీలిస్తే విలన్ పాత్రధారులు దాదాపుగా నిర్మాతలే అయి ఉంటారు. 'నాన్ కడవుళ్'లో నిర్మాత అళగన్ తమిళ్ మణి, 'పరదేశి'లో నిర్మాత జేడి, 'తారా తప్పట్టై'లో నిర్మాత ఆర్కే సురేష్లను విలన్లుగా మార్చారు. ఆ జాబితాలో ఇప్పుడు 'లింగ' నిర్మాత రాక్లైన్ వెంకటేష్ను కూడా చేర్చారన్న మాట.
జ్యోతిక, జీవీ ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'నాచ్చియార్' షూటింగ్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









