విలన్గా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నిర్మాత
- March 04, 2017
తెలుగు, తమిళ చిత్రాలను నిర్మంచిన రాక్లైన్ వెంకటేష్ విలన్గా రానున్నారు. 'లింగ' నష్టాల వ్యవహారంలో పంపిణీదారులు విలన్గా భావించిన నిర్మాత రాక్లైన్ వెంకటేష్ నిజంగానే విలన్గా మారారు. బాలా తెరకెక్కిస్తున్న 'నాచ్చియార్' చిత్రంలో ఆయన విలన్గా నటిస్తున్నారు. బాలా చిత్రాలను మొదటి నుంచి పరిశీలిస్తే విలన్ పాత్రధారులు దాదాపుగా నిర్మాతలే అయి ఉంటారు. 'నాన్ కడవుళ్'లో నిర్మాత అళగన్ తమిళ్ మణి, 'పరదేశి'లో నిర్మాత జేడి, 'తారా తప్పట్టై'లో నిర్మాత ఆర్కే సురేష్లను విలన్లుగా మార్చారు. ఆ జాబితాలో ఇప్పుడు 'లింగ' నిర్మాత రాక్లైన్ వెంకటేష్ను కూడా చేర్చారన్న మాట.
జ్యోతిక, జీవీ ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'నాచ్చియార్' షూటింగ్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







