విలన్గా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నిర్మాత
- March 04, 2017
తెలుగు, తమిళ చిత్రాలను నిర్మంచిన రాక్లైన్ వెంకటేష్ విలన్గా రానున్నారు. 'లింగ' నష్టాల వ్యవహారంలో పంపిణీదారులు విలన్గా భావించిన నిర్మాత రాక్లైన్ వెంకటేష్ నిజంగానే విలన్గా మారారు. బాలా తెరకెక్కిస్తున్న 'నాచ్చియార్' చిత్రంలో ఆయన విలన్గా నటిస్తున్నారు. బాలా చిత్రాలను మొదటి నుంచి పరిశీలిస్తే విలన్ పాత్రధారులు దాదాపుగా నిర్మాతలే అయి ఉంటారు. 'నాన్ కడవుళ్'లో నిర్మాత అళగన్ తమిళ్ మణి, 'పరదేశి'లో నిర్మాత జేడి, 'తారా తప్పట్టై'లో నిర్మాత ఆర్కే సురేష్లను విలన్లుగా మార్చారు. ఆ జాబితాలో ఇప్పుడు 'లింగ' నిర్మాత రాక్లైన్ వెంకటేష్ను కూడా చేర్చారన్న మాట.
జ్యోతిక, జీవీ ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'నాచ్చియార్' షూటింగ్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







