సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు!
- March 06, 2017
బాలీవుడ్ మొత్తాన్ని కొన్ని క్యాంప్స్ మాత్రమే కబ్జా చేశాయంటున్నాడట ఆ వెర్సటైల్ హీరో. తాను నటుడిగా నిలదొక్కుకోలేకపోవడానికి కారణం.. ఆ క్యాంప్ రాజకీయాలే అంటూ మండి పడుతున్నాడట.
రెండున్నర దశాబ్దాల క్రితం బాలీవుడ్లో వన్ ఆఫ్ ద లీడ్ హీరోగా దుమ్మురేపాడు గోవిందా. తనదైన డాన్సులతో.. కామెడీతో ఆడియెన్స్ను ఆకట్టుకొన్న ఈ వెర్సటైల్ హీరో.. రాజకీయాలలో బిజీ అయ్యి సినిమాలకు దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ పాలిటిక్స్ నుండి సినిమాలపై దృష్టిపెట్టి అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించినా అవేమీ గోవిందాకి మునుపటి క్రేజ్ ను మాత్రం తీసుకురాలేక పోయాయి. అయితే తాను మళ్లీ నటుడిగా నిలదొక్కుకోకపోవడానికి అసలు కారణం.. బీటౌన్లో ఉన్న క్యాంప్ రాజకీయాలే అంటూ పెద్ద బాంబ్ పేల్చాడు గోవిందా.
బాలీవుడ్ అంతా ఇప్పుడు గ్రూప్స్గా మారిపోయిందని, ఎవరైనా ఆయా గ్రూపులతో టచ్లో ఉంటేనే వారికి అవకాశాలు వస్తాయని, లేకపోతే ఆ కథానాయకుల పరిస్థితి అంతే అంటూ బీటౌన్ క్యాంప్ రాజకీయాలపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు గోవిందా. ఇంతకీ విషయమేమిటంటే చాలారోజుల తర్వాత గోవిందా సోలో హీరోగా 'ఆగయా హీరో' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి హీరో మాత్రమే కాదు.. రచయిత, నిర్మాత కూడా గోవిందానే.
'ఆగయా హీరో' సినిమా రూపొందించడానికి గోవిందా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందట. తాను ఏ క్యాంప్కి చెందినవాడు కాదు కాబట్టి.. తన సినిమాకి పనిచేయడానికి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఎవరూ ముందుకు రాలేదట. చివరకు రచన చేయమని కొంతమంది అగ్ర రచయితలను సంప్రదిస్తే వారు డిమాండ్ చేసిన అమౌంట్ చూసి ఖంగుతిన్నాడట ఈ వెర్సటైల్ యాక్టర్. దాంతో తానే రచయితగా రంగంలోకి దిగి సినిమాని పూర్తి చేశాడట. ఇక చివరకు ఈ సినిమా రిలీజ్ విషయంలో అతనికి ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదట. అందుకే.. అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయలేక, పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడట గోవిందా. ఫైనల్గా అన్ని అడ్డంకులు దాటుకుని గోవిందా తన సినిమాను ఈనెల 17న విడుదల చేస్తున్నాడు. మరి ఒకప్పుడు బాలీవుడ్ ఆడియెన్స్ని తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేసిన గోవిందా ఇప్పుడు 'ఆగయా హీరో'తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







