అబుధాబిలో భారతీయుడికి బంపర్ లాటరీ
- March 06, 2017
భారతదేశం నుంచి అబుదాబీకి వలస వెళ్లిన ఓ వ్యక్తికి రూ.12కోట్లు లాటరీ తగిలింది. కేరళకు చెందిన 33ఏళ్ల శ్రీరాజ్ కృష్ణన్ కొప్పరింబిల్ దాదాపు ఏడు మిలియన్ దిర్హామ్లు(రూ.12,71,70,000) విలువైన లాటరీని గెలుచుకున్నాడు. సండే రిలీజ్ చేసిన అబుధాబి బిగ్ టిక్కెట్ డ్రాలో ఆయన విజయం సాధించారు. ‘బిగ్ టిక్కెట్ విజేత తానే అని ఫోన్ రాగానే నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు 44698ను నా అదృష్ట నంబకర్ గా మారిపోయింది. ఈ టిక్కెట్ కొన్నప్పుడు ఇదే నా చివరి లాటరీ అనుకున్నాను. ఈ డబ్బుతో భారత్లో ఉన్న గృహ రుణాన్ని తీర్చేస్తాను. నా భార్య కూడా అదే అనుకుంటోంది. నాకు అదృష్టాన్ని తెచ్చిన దేశంలో నేను ఎందుకు ఉండకూడదు.. నేను పరిపక్వత ఉన్న మనిషిని భూమిపై నిలబడి ఆలోచిస్తాను.’’ అని కృష్ణన్ తెలిపారు.
యూఏఈ కి వలస వెళ్లిన కృష్ణన్ ఒక షిప్పింగ్ కంపెనీలో 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతను లాటరీలను తరచూ కొనుగోలు చేస్తుంటారు. కానీ అంతకుముందు ఎన్నడూ గెలుచుకోలేదు. ఇప్పుడే పెద్ద ప్రణాళికలు ఏమీలేవని కృష్ణన్ తెలిపారు. ముందు ఉద్వేగం తగ్గాక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









