దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- January 30, 2026
యూఏఈ: దుబాయ్లోని రెండు వందల మంది డెలివరీ రైడర్లను ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) సత్కరించింది. దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. డెలివరీ సెక్టార్ ఎక్సలెన్స్ అవార్డు రెండవ ఎడిషన్ విజేతలను ప్రకటించారు.
డెలివరీ కంపెనీలు, బైక్ రైడర్లు ట్రాఫిక్ చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండేలా ప్రోత్సహించడంతోపాటు సర్వీస్ డెలివరీలో నాణ్యత మరియు ఎక్సలెన్స్ ప్రమాణాలను పెంచడం ఈ అవార్డు లక్ష్యం అని పేర్కరొన్నారు. ఈ సంవత్సరం గౌరవ విజేతలలో గోల్డ్ కేటగిరీలో 50 మంది రైడర్లు, సిల్వర్ కేటగిరీలో 60 మంది, కాంస్య కేటగిరీలో 90 మంది ఉన్నారు.
ఉత్తమ డెలివరీ కంపెనీ కేటగిరీలో ఎలైట్ జోన్ డెలివరీ సర్వీసెస్, జోన్ డెలివరీ సర్వీసెస్, జాజెల్ లాజిస్టిక్స్ సర్వీసెస్ అవార్డులను అందుకున్నాయి. ప్లాట్ఫారమ్లు మరియు స్మార్ట్ అప్లికేషన్ల కేటగిరీ ద్వారా ఉత్తమ డెలివరీ కంపెనీలుగా DB L.L.C - డెలివరీ హీరో (తలాబత్), CAREEM డెలివరీ సర్వీసెస్, మోటోబాయ్ డెలివరీ సర్వీసెస్ విజేతలుగా నిలిచాయని రోడ్లు మరియు రవాణా అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయిర్ తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..









