లంచాల్లో 'భారత్' టాప్
- March 07, 2017
ప్రభుత్వ ఉద్యోగులతో పని పడితే చాలు.. ఎక్కడ లంచం ఇచ్చుకోవాల్సి వస్తుందోనన్న భయం. భారత్ లో మూడింట రెండొంతుల మంది జనం లంచం ఇచ్చుకోక తప్పని పరిస్థితి. 16 ఆసియా పసిఫిక్ దేశాల్లో లంచావతారులు ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ అప్రతిష్టను మూటగట్టుకుంటోంది.
తాజాగా ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో ప్రతీ 10 మంది భారతీయుల్లో ఏడుగురు లంచాలు ఇచ్చుకోక తప్పని పరిస్థితి నెలకొందని సంస్థ తెలిపింది. భారత్ లో ప్రభుత్వ సేవలు పొందాలంటే లంచం ఇవ్వక తప్పట్లేదని 69శాతం మంది భారతీయులు అభిప్రాయపడినట్లు సర్వే వెల్లడించింది. 65శాతం లంచాలతో వియత్నాం భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది.
మరోవైపు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో లంచాల తీవ్రత అత్యంత తక్కువగా ఉన్న దేశంగా జపాన్ నిలిచింది. ఆ దేశంలో కేవలం 0.2శాతం మంది మాత్రమే లంచాల బారిన పడుతున్నట్లుగా సర్వే వెల్లడించింది. దక్షిణ కొరియాలో ఇది 0.3శాతంగా ఉంది.
ఇక మన పొరుగునే ఉన్న పాకిస్తాన్లో 40 శాతం, చైనాలో 26 శాతం మంది ప్రజలు లంచాలు ఇచ్చుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. మొత్తంగా ఆసియా పసిఫిక్ దేశాల్లో మొత్తం 90కోట్ల మంది ప్రజలు లంచాలు సమర్పించుకుంటున్నట్లుగా సర్వే తెలిపింది. ఇండియాలో లంచాల బారినపడుతున్నవారిలో ఎక్కువ మంది పేద వర్గాలకు చెందినవారేనని సర్వే ద్వారా వెల్లడైంది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









