జనతా గ్యారేజ్' బైక్ని సొంతం చేసుకున్న తారక్ అభిమాని

- March 07, 2017 , by Maagulf
జనతా గ్యారేజ్' బైక్ని సొంతం చేసుకున్న తారక్ అభిమాని

'జనతా గ్యారేజ్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నడిపిన బైక్ ను తారక్ అభిమాని రాజ్ కుమార్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ ఈ బైక్ తో కనిపిస్తాడు. ఈ బైక్ ను చిత్ర నిర్మాతలు మైత్రీ మువీ మేకర్స్ వేలం వేశారు. ఈ వేలంలో నల్గొండ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ రెడ్డి 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా రాజ్ కుమార్ కు బైక్ ను అందజేశారు. ఈ మొత్తాన్ని బసవతారక రామారావు ట్రస్ట్ కు విరాళంగా అందజేయనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్.
కళ్యాణ్ రామ్ నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com