జనతా గ్యారేజ్' బైక్ని సొంతం చేసుకున్న తారక్ అభిమాని
- March 07, 2017
'జనతా గ్యారేజ్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నడిపిన బైక్ ను తారక్ అభిమాని రాజ్ కుమార్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ ఈ బైక్ తో కనిపిస్తాడు. ఈ బైక్ ను చిత్ర నిర్మాతలు మైత్రీ మువీ మేకర్స్ వేలం వేశారు. ఈ వేలంలో నల్గొండ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ రెడ్డి 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా రాజ్ కుమార్ కు బైక్ ను అందజేశారు. ఈ మొత్తాన్ని బసవతారక రామారావు ట్రస్ట్ కు విరాళంగా అందజేయనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్.
కళ్యాణ్ రామ్ నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









