జనతా గ్యారేజ్' బైక్ని సొంతం చేసుకున్న తారక్ అభిమాని
- March 07, 2017
'జనతా గ్యారేజ్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నడిపిన బైక్ ను తారక్ అభిమాని రాజ్ కుమార్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ ఈ బైక్ తో కనిపిస్తాడు. ఈ బైక్ ను చిత్ర నిర్మాతలు మైత్రీ మువీ మేకర్స్ వేలం వేశారు. ఈ వేలంలో నల్గొండ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ రెడ్డి 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా రాజ్ కుమార్ కు బైక్ ను అందజేశారు. ఈ మొత్తాన్ని బసవతారక రామారావు ట్రస్ట్ కు విరాళంగా అందజేయనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్.
కళ్యాణ్ రామ్ నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- 974 బీచ్లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’.. సందడి చేసేలా ఏర్పాట్లు..!!
- కువైట్లో ప్రవాసులకు లోన్లు మరింత కఠినం..!!
- సౌదీ–ఖతార్లో కొత్త చెల్లింపు సదుపాయం..!!
- ఆర్థిక, ఆర్థిక సహకారం బలోపేతంపై బహ్రెయిన్–సెర్బియా చర్చలు..!!
- టెస్లా కార్లు రీకాల్.. ఎయిర్బ్యాగ్లో సాంకేతిక లోపం..!!
- సుల్తాన్ బోట్స్వానా పర్యటనతో కొత్త పెట్టుబడి అవకాశాలు..!!
- షార్జాలో విషాదం.. ఇంట్లో కుప్పకూలి 32 ఏళ్ల భారతీయ మహిళ మృతి..!!
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్







