అమెరికాలో 15 ఏళ్ల జైలు శిక్ష భారతీయుడికి
- March 08, 2017
ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్నాడని ఓ భారతీయుడికి అమెరికా 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా ఓ భారత ఉన్నతాధికారిని చంపేందుకు కూడా ఇతడు పథకం వేశాడని విచారణలో తేలింది. బల్వీందర్ సింగ్ అనే ఈ 42 ఏళ్ళ వ్యక్తి స్వతంత్ర సిక్కు రాష్ట్రం కోసం ఉద్యమానికి ప్రేరేపించేలా ఉగ్రవాద దాడులకు కుట్రచేస్తున్నాడని అమెరికా అటార్నీ డానియెల్ బోగ్డెన్, ఎఫ్బీఐ స్పెషల్ ఏజెంట్ ఇంచార్జ్ ఆరోన్ సీ రౌజ్ కోర్టుకు నివేదించారు. ఇందుకోసం అతడు అమెరికాలో అతడుంటున్న రెనో నుంచి కాలిఫోర్నియాలోని అతడి సహచరుడ్ని వ్యక్తిగతంగా కలుసుకున్నాడని 2013లో ఇతడి బృందంలోని ఒకరు ఉగ్రదాడుల కోసం ఇండియా వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారని కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఇందుకోసం సదరు వ్యక్తికి రెండు సెట్లనైట్ విజన్ గూగుల్స్తో పాటు, ల్యాప్టాప్ కంప్యూటర్లను బల్వీందర్ సింగ్ సమకూర్చాడని పేర్కొన్నారు. విచారణ అనంతరం నిందితుడికి 180 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ రెనోలోని యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి లారీ హిక్స్ తీర్పు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









