అమెరికాలో 15 ఏళ్ల జైలు శిక్ష భారతీయుడికి
- March 08, 2017
ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్నాడని ఓ భారతీయుడికి అమెరికా 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా ఓ భారత ఉన్నతాధికారిని చంపేందుకు కూడా ఇతడు పథకం వేశాడని విచారణలో తేలింది. బల్వీందర్ సింగ్ అనే ఈ 42 ఏళ్ళ వ్యక్తి స్వతంత్ర సిక్కు రాష్ట్రం కోసం ఉద్యమానికి ప్రేరేపించేలా ఉగ్రవాద దాడులకు కుట్రచేస్తున్నాడని అమెరికా అటార్నీ డానియెల్ బోగ్డెన్, ఎఫ్బీఐ స్పెషల్ ఏజెంట్ ఇంచార్జ్ ఆరోన్ సీ రౌజ్ కోర్టుకు నివేదించారు. ఇందుకోసం అతడు అమెరికాలో అతడుంటున్న రెనో నుంచి కాలిఫోర్నియాలోని అతడి సహచరుడ్ని వ్యక్తిగతంగా కలుసుకున్నాడని 2013లో ఇతడి బృందంలోని ఒకరు ఉగ్రదాడుల కోసం ఇండియా వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారని కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఇందుకోసం సదరు వ్యక్తికి రెండు సెట్లనైట్ విజన్ గూగుల్స్తో పాటు, ల్యాప్టాప్ కంప్యూటర్లను బల్వీందర్ సింగ్ సమకూర్చాడని పేర్కొన్నారు. విచారణ అనంతరం నిందితుడికి 180 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ రెనోలోని యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి లారీ హిక్స్ తీర్పు చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









