హజ్ కోటా పెంపు: మార్చ్ 30 డెడ్లైన్
- March 08, 2017
ఖతార్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళే యాత్రీకుల సంఖ్య ఈ ఏడాది బాగా పెరగవచ్చునని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మక్కాలోని గ్రాండ్ మాస్క్ వద్ద విస్తరణ కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి యేడాదీ 20 శాతానికి పైగా హజ్ కోటాని పెంచడం జరుగుతోంది. ఈ ఏడాది కూడా ఆ స్థాయిలోనే పెంపుదల ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు. తొలి వారంలో 10,800 మంది హజ్ కోటా కోసం దరఖాస్తు చేసుకున్నారు. మార్చ్ 30తో అప్లికేషన్లకు డెడ్లైన్ ముగుస్తుంది. ఏప్రిల్ మధ్యలో అప్లికేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఎంపికైనవారికి ఇ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందజేస్తారు. అప్లికెంట్స్ నుంచి పూర్తి సమాచారాన్ని అందుకోవడం ద్వారా వారికి హజ్ యాత్రలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే తెలుసుకునేందుకు వీలవుతుందని అధికారులు అంటున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా బాగా పనిచేస్తోందని వారు అంటున్నారు. అరబిక్ మరియు ఇంగ్లీషు భాషల్లో మినిస్ట్రీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ల కోసం అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్