హజ్ కోటా పెంపు: మార్చ్ 30 డెడ్లైన్
- March 08, 2017
ఖతార్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళే యాత్రీకుల సంఖ్య ఈ ఏడాది బాగా పెరగవచ్చునని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మక్కాలోని గ్రాండ్ మాస్క్ వద్ద విస్తరణ కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి యేడాదీ 20 శాతానికి పైగా హజ్ కోటాని పెంచడం జరుగుతోంది. ఈ ఏడాది కూడా ఆ స్థాయిలోనే పెంపుదల ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు. తొలి వారంలో 10,800 మంది హజ్ కోటా కోసం దరఖాస్తు చేసుకున్నారు. మార్చ్ 30తో అప్లికేషన్లకు డెడ్లైన్ ముగుస్తుంది. ఏప్రిల్ మధ్యలో అప్లికేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఎంపికైనవారికి ఇ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందజేస్తారు. అప్లికెంట్స్ నుంచి పూర్తి సమాచారాన్ని అందుకోవడం ద్వారా వారికి హజ్ యాత్రలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే తెలుసుకునేందుకు వీలవుతుందని అధికారులు అంటున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా బాగా పనిచేస్తోందని వారు అంటున్నారు. అరబిక్ మరియు ఇంగ్లీషు భాషల్లో మినిస్ట్రీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ల కోసం అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









