5మంది ఉగ్రవాదులను.. ఉరి తీసిన పాకిస్తాన్
- March 08, 2017
కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులను పాకిస్థాన్ బుధవారం ఉరి తీసింది. ఓ కారాగారంలో మరణ శిక్షను అమలు చేసినట్లు పాక్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఐదుగురు తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులుగా తెలిపాయి. పాక్లో ఉగ్రదాడులకు పాల్పడిన వీరిని రెండు నెలల కిందట మూతపడిన ఆర్మీ కోర్టు దోషులుగా ఖరారు చేసి మరణశిక్ష విధించింది.
2014లో పాక్కు చెందిన తాలిబాన్ ఉగ్రవాదులు ఆర్మీ స్కూల్పై దాడి చేసి చిన్నారులతో పాటు 150 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో ప్రత్యేక ఆర్మీ కోర్టులను ఏర్పాటు చేసిన పాక్ ప్రభుత్వం రెండేళ్ళ కాలంలో 400 మందికిపైగా ఉగ్రవాదులకు మరణ శిక్షలు విధించి అమలు చేసింది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









