5మంది ఉగ్రవాదులను.. ఉరి తీసిన పాకిస్తాన్

- March 08, 2017 , by Maagulf
5మంది ఉగ్రవాదులను.. ఉరి తీసిన పాకిస్తాన్

కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులను పాకిస్థాన్ బుధవారం ఉరి తీసింది. ఓ కారాగారంలో మరణ శిక్షను అమలు చేసినట్లు పాక్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఐదుగురు తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులుగా తెలిపాయి. పాక్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన వీరిని రెండు నెలల కిందట మూతపడిన ఆర్మీ కోర్టు దోషులుగా ఖరారు చేసి మరణశిక్ష విధించింది.
2014లో పాక్‌కు చెందిన తాలిబాన్ ఉగ్రవాదులు ఆర్మీ స్కూల్‌పై దాడి చేసి చిన్నారులతో పాటు 150 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో ప్రత్యేక ఆర్మీ కోర్టులను ఏర్పాటు చేసిన పాక్ ప్రభుత్వం రెండేళ్ళ కాలంలో 400 మందికిపైగా ఉగ్రవాదులకు మరణ శిక్షలు విధించి అమలు చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com