ఐసీసీ మహిళల వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా లిటిల్ మాస్టర్
- March 08, 2017
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ అఫీసియల్ బ్రాండ్ అంబాసిడర్గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను ఎంపిక చేసినట్లు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొంది. మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం)ను పురస్కరించుకుని క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో మహిళల వరల్డ్ కప్ 2017 షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ మీడియాతో మాట్లాడారు. మహిళల వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయడానికి మార్చి 8 సరైన రోజని భావించామని ఆయన అన్నారు.
అదే విధంగా బుధవారం (మార్చి 8) మధ్యాహ్నం నుంచి గ్రూప్ స్టేజీ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే మహిళల వరల్డ్ కప్ టోర్నీ జూన్ 24 నుంచి జులై 23 వరకు జరగనుంది. 21 రోజుల్లో 28 మ్యాచ్లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జులై 23న క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో భాగంగా జూన్ 24న డెర్బీ వేదికగా భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడనుంది. బ్రిస్టల్ వేదికగా
న్యూజిలాండ్తో శ్రీలంక తలపడనుంది.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







