వేల సంఖ్యలో సరిహద్దులు దాటిన అఫ్ఘనిస్థాన్ మరియు పాకిస్తాన్ దేశస్తులు
- March 09, 2017
దాదాపుగా 51వేలమంది అఫ్ఘనిస్థాన్ దేశస్తులు, 2,700మంది పాకిస్థానీయులు తమ సరిహద్దులు దాటారు. గత నెల రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అఫ్ఘన్తో సరిహద్దును మూసివేసిన పాక్ రెండు రోజులపాటు తిరిగి తెరిచింది. దీంతో ఆ రెండు దేశాల్లో ఆగిపోయిన వారంతా తమ మాతృదేశానికి తరలి వెళ్లారు. ఇప్పటి వరకు పైన పేర్కొన్న సంఖ్యలో సరిహద్దు దాటారని పాక్ అధికారులు తెలిపారు.
అఫ్ఘనిస్థాన్ వెళ్లడానికి పాక్కు బాలోచిస్థాన్లోని తోర్కాం, చమన్ ప్రాంతాల వద్ద ఉన్న సరిహద్దు ప్రాంతమే అతి పెద్దది.. కీలకమైనది. ఈ ప్రాంతంలో గత నెల మిలటరీ దాడి జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సరిహద్దును మూసివేశారు.
చివరకు రాజకీయ చర్చలు జరిగి వేగంగా ఇరు దేశాల వారిని మార్పిడి చేసుకునే ఒప్పందం చేసుకొని, ఇమ్మిగ్రేషన్ చట్టాలను పరిశీలించి తాజాగా సరిహద్దును తెరిచారు. ఇప్పటివరకు మొత్తం 55 వేలమంది పరస్పరం తమ ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







