వేల సంఖ్యలో సరిహద్దులు దాటిన అఫ్ఘనిస్థాన్ మరియు పాకిస్తాన్ దేశస్తులు
- March 09, 2017
దాదాపుగా 51వేలమంది అఫ్ఘనిస్థాన్ దేశస్తులు, 2,700మంది పాకిస్థానీయులు తమ సరిహద్దులు దాటారు. గత నెల రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అఫ్ఘన్తో సరిహద్దును మూసివేసిన పాక్ రెండు రోజులపాటు తిరిగి తెరిచింది. దీంతో ఆ రెండు దేశాల్లో ఆగిపోయిన వారంతా తమ మాతృదేశానికి తరలి వెళ్లారు. ఇప్పటి వరకు పైన పేర్కొన్న సంఖ్యలో సరిహద్దు దాటారని పాక్ అధికారులు తెలిపారు.
అఫ్ఘనిస్థాన్ వెళ్లడానికి పాక్కు బాలోచిస్థాన్లోని తోర్కాం, చమన్ ప్రాంతాల వద్ద ఉన్న సరిహద్దు ప్రాంతమే అతి పెద్దది.. కీలకమైనది. ఈ ప్రాంతంలో గత నెల మిలటరీ దాడి జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సరిహద్దును మూసివేశారు.
చివరకు రాజకీయ చర్చలు జరిగి వేగంగా ఇరు దేశాల వారిని మార్పిడి చేసుకునే ఒప్పందం చేసుకొని, ఇమ్మిగ్రేషన్ చట్టాలను పరిశీలించి తాజాగా సరిహద్దును తెరిచారు. ఇప్పటివరకు మొత్తం 55 వేలమంది పరస్పరం తమ ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి
- బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు
- దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి
- హైదరాబాద్లో ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభం
- తెలంగాణ పోలీస్లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా
- అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- గుడ్ న్యూస్..డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ







