ప్రముఖ హీరో తల్లి సింగర్గా ఎంట్రీ
- March 09, 2017
టి.రాజేందర్ వారసుడిగా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నాడు శింబు. నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కూడా. గతేడాది అతని సోదరుడు కురలరసన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ఇప్పుడు శింబు కూడా స్వరకర్తగా మారారు. అంతేకాదు, తన తొలి ఆల్బమ్లో తల్లిదండ్రులిద్దరి చేత పాట పాడించడం విశేషం. టి.రాజేందర్ ఇదివరకు అనేక చిత్రాల్లో పాటలు పాడడం అందరికీ తెలిసిందే. అయితే తొలిసారి శింబు తల్లి ఉషా కూడా గాయనిగా మారారు. సంతానం హీరోగా తెరకెక్కుతున్న 'సక్క పోడు పోడు రాజా' చిత్రానికి శింబు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. హాస్యనటుడు వీటీవీ గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పోర్షన్స్ పూర్తి చేసుకుని, వచ్చే వారంలో పాటల చిత్రీకరణ జరుపుకోనుంది.
ఊటీ, బెంగళూరు, చెన్నైలతోపాటు అమెరికాలోనూ పాటల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









