ప్రముఖ హీరో తల్లి సింగర్గా ఎంట్రీ
- March 09, 2017
టి.రాజేందర్ వారసుడిగా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నాడు శింబు. నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కూడా. గతేడాది అతని సోదరుడు కురలరసన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ఇప్పుడు శింబు కూడా స్వరకర్తగా మారారు. అంతేకాదు, తన తొలి ఆల్బమ్లో తల్లిదండ్రులిద్దరి చేత పాట పాడించడం విశేషం. టి.రాజేందర్ ఇదివరకు అనేక చిత్రాల్లో పాటలు పాడడం అందరికీ తెలిసిందే. అయితే తొలిసారి శింబు తల్లి ఉషా కూడా గాయనిగా మారారు. సంతానం హీరోగా తెరకెక్కుతున్న 'సక్క పోడు పోడు రాజా' చిత్రానికి శింబు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. హాస్యనటుడు వీటీవీ గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పోర్షన్స్ పూర్తి చేసుకుని, వచ్చే వారంలో పాటల చిత్రీకరణ జరుపుకోనుంది.
ఊటీ, బెంగళూరు, చెన్నైలతోపాటు అమెరికాలోనూ పాటల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







