సౌదీ అరేబియాలో తీవ్రవాది హతం
- March 11, 2017
భద్రతాదళాలు ఈస్టర్న్ ప్రావిన్స్లో తీవ్రవాది ముస్తఫా అల్ మదాద్ని మట్టుబెట్టాయి. ఖాతిఫ్లో అల్ షాకియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అల్ మదాద్ దేశ వ్యతిరేక శక్తిగా గత కొంతకాలంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. భద్రతాదళాలకు తీవ్రవాది ఎదురుపడ్డ సందర్బంలో అతన్ని లొంగిపోవాల్సిందిగా చేసిన హెచ్చరికల్ని బేఖాతరు చేశాడు. భద్రతాదళాలపైకి తీవ్రవాది కాల్పులు జరిపాడు. తిరిగి భద్రతాదళాలు కాల్పులు జరపడంతో, అల్ మదాద్ మృతి చెందాడు. ఈ ఘటనలో భధ్రతా దళాలకు సంబంధించిన ఒకరు గాయాల పాలయ్యారు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఇంకా తీవ్రవాదులున్నారేమో అన్న కోణంలో భద్రతాదళాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. తీవ్రవాదులకు సంబంధించిన సమాచారంగానీ, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్కి సంబంధించిన సమాచారంగానీ 990 నెంబర్లో తెలిజేయవచ్చుననీ, ఖచ్చితమైన సమాచారం ఇచ్చినవారికి ప్రోత్సాహకాలు ఉంటాయి ఇంటీరియర్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







