భారతీయ వ్యక్తి ఫేస్బుక్ దుర్వినియోగం 250,000 ధిర్హాంల జరిమానా...దేశ బహిష్కరణ
- March 14, 2017
' చెరపకురా ....చెడేవు ' అనే పదం ఈ వార్తకు సరిగ్గా సరిపోతుంది...గత ఏడాది ఆగస్టులో ప్రముఖ మలబారు గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థపై ఫేస్బుక్ లో అవాకులు చెవాకులు పేలిన ఓ పోస్ట్ ని కేవలం షేర్ చేసినందుకు ఫలితం ఒక భారతీయుడికి 250,000 ధిర్హాంల జరిమానా, దేశ బహిష్కరణ ఏకకాలంలో దక్కాయి. సామాజిక మీడియాలో తమకు సంబంధం లేని విషయాలపై జోక్యం చేసుకొంటే...ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఆ శిక్ష ఏ స్థాయిలో ఉంటుందో ఇందుకు అద్దం పడుతుంది. ఫేస్బుక్ దుర్వినియోగం చేసిన ఆ భారతీయునికి వ్యతిరేకంగా దుబాయ్ లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఈ తీర్పు జారీ చేసింది. అంతే కాకుండా సంబంధిత వ్యక్తికి చెందిన ఫేస్బుక్ లో ఆయా వివాదాస్పద ఫోటోలు తొలగించి తన ప్రొఫైల్ అకౌంట్ ను ఒక సంవత్సరం పాటు మూసివేయాలని ఆదేశించింది. అయితే, ఈ 36 ఏళ్ళ భారతీయ వ్యక్తి నేరంపై ఏడు రోజుల్లో మరల ఒక విజ్ఞప్తిని కోర్టుకు చేసుకొనే హక్కు ఉందని ఆదివారం వెలువడిన ఆ తీర్పులో వెలువరించింది. అదే సంస్థలో ఉద్యోగిగా గతంలో పనిచేశాడు. తన మాజీ యజమానిపై , మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థను కించబరుస్తూ వ్యతిరేకంగా వెలువడిన ఓ ఫేస్బుక్ పోస్ట్ ని షేర్ చేసిన కారణంగా గత ఏడాది ఆగస్టులో నిందితుడిని దుబాయ్ పోలీసులు అరెస్టు సైతం చేశారు. గత ఏడాది దుబాయ్ లో పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున వినియోగదారుల కోసం ఒక పోటీ నిర్వహించిన కార్యక్రమంలో ఇదే భారతీయ వ్యక్తి భారతదేశం మరియు యూఏఈ లో సామాజిక మీడియా ద్వారా వినియోగదారులకు సంస్థని అనుకూలంగా ప్రాచుర్యం చేసిన చురుకైన నేపధ్యం సైతం ఆయనకు ఉంది.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









