ఆంధ్రప్రదేశ్ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
- March 15, 2017
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇవ్వడంతో పాటు, పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకుంటుందని పేర్కొంది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
బుధవారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడో టేబుల్ అంశంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం చర్చకు వచ్చింది. దీనికి మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు బదులుగా గతేడాది సెప్టెంబర్ 8న కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఐఐఐటీ బిల్లుకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 2శాతం డీఏ చెల్లింపునకు కేంద్రమంత్రివర్గం ఓకే చెప్పింది. జనవరి 2017 నుంచి అదనపు డీఏ వర్తించనుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







