ఓ శుభవార్త సామ్సంగ్ ఎస్8 కొందామనుకుంటున్నవారికి
- March 16, 2017
ఎన్నో ప్రత్యేకతలతో రాబోతున్న సామ్సంగ్ గెలాక్సీ ఎస్8 మొదటి నుంచీ వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ర్యామ్ మొదలుకుని డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా వంటి ఎన్నో స్పెసిఫికేషన్లపై చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి సమాచారమూ విడుదల చేయని సంస్థ తొలిసారి ఎస్8పై ఓ శుభవార్త తెలిపింది. మార్చి 29న దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఎస్7తో భంగపడ్డ సంస్థ ఎస్8 విషయంలో మాత్రం చాలా ప్రత్యేకంగా తీసుకురాబోతుంది. వినూత్నంగా ఉండేలా ఇన్ఫినిటీ డిస్ప్లేతో రాబోతున్నట్లు తెలుస్తోంది. 18:9 రేషియోతో ఫుల్ విజన్ డిస్ప్లే కొత్త అనుభూతిని మిగులుస్తుంది. మొబైల్ని ఐమూలగా చూసినా స్పష్టంగా కనిపించడమే దీని ప్రత్యేకత.
ర్యామ్ 6జీబీ, అంతర్గత మెమరీ 128 జీబీ ఉండబోతుంది. నూగట్ వర్షన్తో రాబోయే ఈ స్మార్ట్ఫోన్ అల్ట్రా హెచ్డీ రిజిల్యూషన్తో 6.2 అంగుళాల తాకే తెరతో వస్తుంది. వెనుక కెమెరా 16 మెగా ఫిక్సెల్, బ్యాటరీ 3000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







