తప్పిన పెను ప్రమాదం క్రికెటర్ ధోనీకి
- March 17, 2017
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్ కెప్టెన్గా హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన ధోనీ నగరంలోని ఓ హోటల్లో జట్టు సభ్యులంతా కలిసి బసకు దిగారు. అయితే ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఆటగాళ్ళు అక్కడినుంచి పరుగులు తీశారు. ప్రమాదంలో ఎవరికీ ఏమి కానందున హోటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కాగా మ్యాచ్ ఆడటానికి తీసుకువచ్చిన కిట్ మొత్తం మంటల్లో కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. కిట్ మొత్తం కాలి బూడిదవ్వడంతో మ్యాచ్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







