తప్పిన పెను ప్రమాదం క్రికెటర్ ధోనీకి
- March 17, 2017
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్ కెప్టెన్గా హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన ధోనీ నగరంలోని ఓ హోటల్లో జట్టు సభ్యులంతా కలిసి బసకు దిగారు. అయితే ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఆటగాళ్ళు అక్కడినుంచి పరుగులు తీశారు. ప్రమాదంలో ఎవరికీ ఏమి కానందున హోటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కాగా మ్యాచ్ ఆడటానికి తీసుకువచ్చిన కిట్ మొత్తం మంటల్లో కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. కిట్ మొత్తం కాలి బూడిదవ్వడంతో మ్యాచ్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









