తప్పిన పెను ప్రమాదం క్రికెటర్ ధోనీకి
- March 17, 2017
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్ కెప్టెన్గా హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన ధోనీ నగరంలోని ఓ హోటల్లో జట్టు సభ్యులంతా కలిసి బసకు దిగారు. అయితే ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఆటగాళ్ళు అక్కడినుంచి పరుగులు తీశారు. ప్రమాదంలో ఎవరికీ ఏమి కానందున హోటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కాగా మ్యాచ్ ఆడటానికి తీసుకువచ్చిన కిట్ మొత్తం మంటల్లో కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. కిట్ మొత్తం కాలి బూడిదవ్వడంతో మ్యాచ్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









