15 నెలల తర్వాత వీడిన కేసు మిస్టరీ అమెరికాలో తల్లిని చంపిన తెలుగబ్బాయి
- March 18, 2017
అమెరికాలో 15 నెలల క్రితం హత్యకు గురైన ఓ తెలుగు మహిళ హత్య కేసులోని మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించిందారు. ఈ హత్య చేసింది.. ఆమె పేగు తెంచుకుని పుట్టిన కొడుకేనని పోలీసులు గుర్తించారు. తల్లిని చంపిన ఆ కసాయి కొడుకు.. మృతదేహాన్ని గ్యారేజ్లోని కారులో ఉంచి ఏం తెలియనట్టుగా స్కూల్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి.. తన తల్లిని ఎవరో చంపేశారంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే హత్యా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య గత 2015 డిసెంబరు నెల 17వ తేదీన జరుగగా, ఈ కేసును పలు కోణాల్లో విచారించిన పోలీసులు... చివరకు మృతురాలి కుమారుడే హంతకుడిగా నిర్ధారించారు.
దీంతో ఆమె కొడుకు 17 యేళ్ళ అర్నవ్ ఉప్పలపాటిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడించారు. కాగా, హత్యకు గురైన మహిళ పేరు నళిని తెల్లప్రోలు. వీరు కరోలినాలోని రోలాండ్ గ్లెన్ రోడ్డులూ నివశిస్తూ వచ్చారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







