15 నెలల తర్వాత వీడిన కేసు మిస్టరీ అమెరికాలో తల్లిని చంపిన తెలుగబ్బాయి
- March 18, 2017
అమెరికాలో 15 నెలల క్రితం హత్యకు గురైన ఓ తెలుగు మహిళ హత్య కేసులోని మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించిందారు. ఈ హత్య చేసింది.. ఆమె పేగు తెంచుకుని పుట్టిన కొడుకేనని పోలీసులు గుర్తించారు. తల్లిని చంపిన ఆ కసాయి కొడుకు.. మృతదేహాన్ని గ్యారేజ్లోని కారులో ఉంచి ఏం తెలియనట్టుగా స్కూల్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి.. తన తల్లిని ఎవరో చంపేశారంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే హత్యా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య గత 2015 డిసెంబరు నెల 17వ తేదీన జరుగగా, ఈ కేసును పలు కోణాల్లో విచారించిన పోలీసులు... చివరకు మృతురాలి కుమారుడే హంతకుడిగా నిర్ధారించారు.
దీంతో ఆమె కొడుకు 17 యేళ్ళ అర్నవ్ ఉప్పలపాటిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడించారు. కాగా, హత్యకు గురైన మహిళ పేరు నళిని తెల్లప్రోలు. వీరు కరోలినాలోని రోలాండ్ గ్లెన్ రోడ్డులూ నివశిస్తూ వచ్చారు.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







