ఖతార్ లో అంబరాన్నంటిన ఈద్ సంబరాలు
- September 26, 2015
ఈద్ సంబరాల నేపథ్యంలో మాల్స్, పార్కులు, బీచ్లు సహా ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్నీ సందర్శకులతో కళకళ్ళాడాయి. ఖతార్ టూరిజం అథారిటీ, సందర్శకుల్ని అలరించేందుకు శుక్రవారం పలు వినోద కార్యక్రమాల్ని వివిధ ప్రాంతాల్లో చేపట్టాయి. కటారా, సౌక్ వఖిఫ్, పెరల్ కతార్ మరియు ఎస్పర్ జోన్ ఇంకా ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు సందడి చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం పాకిస్తానీయుల కోసం అల్ వక్రా మరియు అల్ నూర్లో నేపాలీయుల కోసం మరో కార్యక్రమం నిర్వహించింది. చిన్న పిల్లల ఎంటర్టైన్మెంట్తోపాటు, ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టారు. హయాత్ ప్లాజా సూపర్వైజర్ మహమ్మద్ సాహిల్ మాట్లాడుతూ, తొలి రోజు ఈద్ సాయంత్రం నుంచి ప్లాజా మొత్తం సందర్శకులతో నిండిపోయినట్లు చెప్పారు. జంగిల్ జోన్లో పిల్లలు ఆడిపాడుతూ ఎంజాయ్ చేశారన్నారు. సోమవారం వరకూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని, అప్పటిదాకా ప్లాజా జనంతో నిండిపోతుందని ఆయన చెప్పారు. కొన్ని ఈవెంట్స్ ఏడు రోజులపాటు కొనసాగనున్నాయి.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







