ఇళయరాజా సాంగ్స్ పాడను ఇక నుంచి ఎక్కడా: ఎస్పీ బాలు
- March 20, 2017
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం "ఎస్పీబీ-50" కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి విధితమే.. ఈ కార్యక్రమంలో భాగంగా బాలసుబ్రమణ్యం అండ్ కో వారు అమెరికాలో ఉన్నారు.. ఈ నేపద్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఎస్పీ బాలు కి లీగల్ నోటీసులు పంపించారు.. ఈ విషయంపై బాలసుబ్రమణ్యం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ..."ఇళయరాజా నుంచి లీగల్ నోటీసు అందుకున్న తర్వాత ఆశ్చర్యం వేసింది. నాతోపాటు నా కుమారుడు చరణ్, చిత్రకు కూడా నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులో తన అనుమతి లేకుండా ఇళయరాజా పాటలు పాడకూడదని, అలా చేస్తే కాపీరైటు నిబంధనల ఉల్లంఘన కింద పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి వస్తుందని ఉంది. నాకు చట్టపరమైన నోటీసులు వచ్చినప్పుడు నేను కూడా చట్టపరంగానే స్పందించాల్సి ఉంటుంది.. కానీ నాకు అటువంటివి ఇష్టం ఉండదు. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. ఇక నుంచి ఇళయరాజా కు అసౌకర్యం కలిగేలా ఆయన పాటల్ని లను పాడబోమని తెలిపారు.. ఈ యాత్ర నిర్వాహకులు, ప్రాయోజకులను ఇబ్బంది పెట్టేలా తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు. కాగా ఇదే విషయంపై బాలు మద్దతుగా కొంతమంది.. ఇళయరాజకు మద్దతు గా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.. కాగా బాలసుబ్రమణ్యం, ఇళయరాజాలు కలిసి దాదాపు 40 ఏళ్లనుంచి కొన్ని వేల పాటలకు కలిసి పనిచేశారు.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









