వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్ 2019 కోసం
- March 20, 2017
అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు కావొస్తుండడంతో ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీలక మార్పులు జరగొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. బడ్జెట్ సమావేశాలు ముగిశాక కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. పని చేయని నేతలను పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డబుల్ బెడ్రూమ్ స్కీమ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఈ నెలాఖరు నాటికి రెండున్నర లక్షలకి పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి కావలసి ఉంది. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేసీఆర్ ఈ ఏడాది చివరి నాటికి రెండు లక్షల ఇళ్ళు నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అదే సమయంలో రెండున్నరేళ్ళ పాలనపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకోవాలని అనుకుంటున్న కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారు.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







