వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్ 2019 కోసం
- March 20, 2017
అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు కావొస్తుండడంతో ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీలక మార్పులు జరగొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. బడ్జెట్ సమావేశాలు ముగిశాక కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. పని చేయని నేతలను పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డబుల్ బెడ్రూమ్ స్కీమ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఈ నెలాఖరు నాటికి రెండున్నర లక్షలకి పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి కావలసి ఉంది. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేసీఆర్ ఈ ఏడాది చివరి నాటికి రెండు లక్షల ఇళ్ళు నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అదే సమయంలో రెండున్నరేళ్ళ పాలనపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకోవాలని అనుకుంటున్న కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









