సౌదీ అరేబియాలో బంధీలైన 29 మందిని విడపించమంటూ సుష్మాకు కేటీఆర్ లేఖ
- March 21, 2017
సౌదీ అరేబియాలోని అల్హసాలో ఉన్ అల్ హజారీ ఓవర్సీస్ కంపెనీలో పని చేస్తున్ 29 మంది తెలంగాణ రాష్ట్ర వాసులను ఆ కంపెనీ గత 12 రోజులుగా నిర్భంధించిందని పురపాలక, ఐటీ, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కె. తారకరామారావు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకువెళ్ళారు. వీరందరిని విడిపించి వారి వారి స్వస్థలాలకు తిరిగి తీసుకు వచ్చే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవానలి కేటీఆర్ కేంద్రమంత్రికి సోమవారం లేఖ రాశారు. సౌదీ కంపెనీలో పని చేస్తున్న వీరంతా తమ స్వగ్రామాలకు వెళ్ళిపోతామని వేడుకున్నా వినకుండా వారిని కంపెనీ యాజమాన్యం ఒక గదిలో బంధించి ఉంచిదని తెలిపారు. భోజనం,నీరు,మందులు ఇవ్వకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా 12 రోజులుగా చిత్ర హింసలు పెడుతున్నారని తెలిపారు. సౌదీ నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన బోరగళ్ళ శేఖర్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని తమకు తెలియజేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం









