ఈ స్థాయి లేదు మణిరత్నం గారిని కలవక పోతే : రెహ్మాన్
- March 21, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ మొదట కోటి వంటి సంగీత దర్శకుల వద్ద కీ బోర్డ్ ప్లేయర్ గా చేసిన సంగతి విధితమే.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన "రోజా" సినిమాతో రెహ్మాన్ సంగీత దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.. రోజా రిలీజైన అన్నీ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ హిట్ లో రెహ్మాన్ సంగీతం కూడా భాగం పంచుకొన్నది. ఒక్క సినిమాతోనే యావత్ సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకొన్న రెహ్మాన్ ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకొన్నాడు.. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన కాట్రువెలియిడై కు సంగీతం అందించాడు.. సోమవారం ఉదయం చెన్నయ్ రాయపేటలోని సత్యం సినిమాస్ థియేటర్లో జరిగిన ఆడియో వేడుకలో పాల్గొన్న రెహ్మాన్ మాట్లాడుతూ.. నేను దర్శకుడు మణిరత్నం గారిని కలిసి ఉండక పోతే ఈ స్థాయిలో ఉండేవాడిని కాను.. అని పేర్కొన్నాడు.. ఈ రోజు ఇంతటి పేరు ప్రఖ్యాతలు అందుకొంటున్నాను అంటే దానికి ముఖ్య కారణం మణిరత్నం గారు అని తనకు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన ఆయనపై అభిమానాన్ని చాటుకొన్నాడు.. రెహ్మాన్.
తాజా వార్తలు
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం









