ఈ స్థాయి లేదు మణిరత్నం గారిని కలవక పోతే : రెహ్మాన్
- March 21, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ మొదట కోటి వంటి సంగీత దర్శకుల వద్ద కీ బోర్డ్ ప్లేయర్ గా చేసిన సంగతి విధితమే.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన "రోజా" సినిమాతో రెహ్మాన్ సంగీత దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.. రోజా రిలీజైన అన్నీ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ హిట్ లో రెహ్మాన్ సంగీతం కూడా భాగం పంచుకొన్నది. ఒక్క సినిమాతోనే యావత్ సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకొన్న రెహ్మాన్ ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకొన్నాడు.. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన కాట్రువెలియిడై కు సంగీతం అందించాడు.. సోమవారం ఉదయం చెన్నయ్ రాయపేటలోని సత్యం సినిమాస్ థియేటర్లో జరిగిన ఆడియో వేడుకలో పాల్గొన్న రెహ్మాన్ మాట్లాడుతూ.. నేను దర్శకుడు మణిరత్నం గారిని కలిసి ఉండక పోతే ఈ స్థాయిలో ఉండేవాడిని కాను.. అని పేర్కొన్నాడు.. ఈ రోజు ఇంతటి పేరు ప్రఖ్యాతలు అందుకొంటున్నాను అంటే దానికి ముఖ్య కారణం మణిరత్నం గారు అని తనకు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన ఆయనపై అభిమానాన్ని చాటుకొన్నాడు.. రెహ్మాన్.
తాజా వార్తలు
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!







