ఉగ్రవాదులపై భారత్ కు బాంగ్లాదేశ్ రిపోర్ట్
- March 21, 2017
బంగ్లాదేశ్ ఇచ్చిన నివేదిక ఒకటి ఇప్పుడు భారత్లో కలకలం రేపుతోంది. తమ దేశం నుంచి ఏకంగా 2000 వేలమందికి పైగా ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారని భారత హోంశాఖకు బంగ్లాదేశ్ నివేదిక ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, భారత్లో చొరబడిన ఉగ్రవాదులంతా జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ), హర్కత్ ఉల్ జిహాదీ అల్ ఇస్లామీ(హుజీ) సంస్థలకు చెందినవారని ఆ నివేదికలో పేర్కొంది.
గత ఏడాది వీరు తమ సరిహద్దులను దాటి పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో అడుపెట్టారని తెలిపింది. భారత్లో చొరబడిన 2,010 మంది ఉగ్రవాదుల్లో 1,290 మంది అసోం, త్రిపుర రాష్ట్రాల్లో ప్రవేశించగా..మిగతా వారు పశ్చిమ బెంగాల్కు వెళ్లారని పేర్కొంది. ఈ నివేదికతో త్రిపుర, అసోం రాష్ట్రాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా దళాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









