​ ఓమాన్ లోని సామాజిక సేవకుకునికి ధన్యవాదాలు

- March 21, 2017 , by Maagulf
​ ఓమాన్ లోని సామాజిక సేవకుకునికి ధన్యవాదాలు

నేను ట్విట్టర్ లో చేసిన విజ్ఞప్తికి స్పందించి కేవలం 40 నిమిషాల్లోనే జవాబు ఇచ్చిన ఓమాన్ (మస్కట్) లోని ఇండియన్ ఎంబసీకి కృతఙ్ఞతలు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల కేంద్రమైన గంభీరావుపేట కు చెందిన గొట్టిముక్కల భాను చందర్ (23) ఇటీవల ఓమాన్ లోని సోహార్ లో మరణించాడు.

ఇతని మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపాలని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ కి తేది: 21.03.2017 న సాయంత్రం 05:31 pm కు ట్వీట్ చేశాను. ఎంబసీ నుండి ఎన్ ఓ సి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేశామని, మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపడానికి సమన్వయం చేస్తున్నామని తెలుపుతూ 40 నిమిషాలలోనే అనగా 06:11 pm కు జవాబు ట్వీట్ చేశారు.

--యం.భీం రెడ్డి 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com