జోరు తగ్గిన నిమజ్జనం

- September 26, 2015 , by Maagulf
జోరు తగ్గిన నిమజ్జనం

ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనం మందకొడిగా జరుగుతోంది. ఉదయం 8గంటల వరకూ 2 వేల 556 విగ్రహాలను అధికారులు నిమజ్జనం చేశారు. అయితే ఇంకా భారీ స్థాయిలో విగ్రహాలు నిమజ్జనానికి వేచి ఉన్నాయి. నిన్న రాత్రి వచ్చిన విగ్రహాలు సైతం ఇంకా ట్యాంక్ బండ్ పై బారులు తీరి ఉన్నాయి. క్రేన్ ల వద్ద నిమజ్జనం ఆలస్యం కావడం పై భక్తులు ఆందోళన చెందుతున్నారు. బాలాపూర్ నుంచి శోభయాత్ర మొదలైతే.. భారీ సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్ వచ్చి చేరుతాయని... ఈ లోపు ఇప్పటికే వచ్చిన విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com