ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెల ఉత్సవం.. 2 మిలియన్ సందర్శకుల రాక
- March 23, 2017
రియాద్ కు ఈశాన్య వైపున120 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుమాహ్ లో మంగళవారం ఒక ఆహ్లాదకరమైన నులివెచ్చని వాతావరణంతో కింగ్ అబ్దుల్ అజిజ్ ఒంటెల ఉత్సవం ప్రారంభమై సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. 28 రోజుల పాటు జరిగే ఈ ఒంటెల పండుగని చూసేందుకు వచ్చేవారి సంఖ్య ఈ ఏడాది అధికంగా ఉండొచ్చని ఉత్సవ నిర్వాహకుల అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం 2 మిలియన్లకు పైగా సందర్శకులు ఈ ఉత్సవంకు వస్తారని భావిస్తున్నారు.వివిధ గల్ఫ్ దేశాల నుంచి 1,390 మంది ఒంటెల యజమానులు ఈ పోటీలో పాల్గొనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమంగా అభివర్ణించవచ్చని ఈ పండుగ యొక్క ప్రతినిధి డాక్టర్ తలాల్ బిన్ ఖాలిద్ అల్ తొరిఫ్య్ చెప్పారు. పురాతన సాంప్రాయాదాయక వారసత్వం గూర్చి కొత్త తరాల వారికి అనుసంధానిస్తుందని సౌదీ అరేబియా విజన్ 2030 కు ఈ కార్యక్రమం ఒక ప్రేరణ మరియు ప్రతిబింబం వలె పనిచేస్తుంది, ఆ దిశలో ఈ సంవత్సరం పండుగ ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు ఈ ఏడాది పండుగ నినాదం " ఒంటెలు నాగరికత కల్గి ఉన్నాయి." ఈ ఒంటెల పోటీలో జాతి మరియు రంగుతో సహా ఐదు రకాల వివిధ తరగతులలో న్యాయమైన తీర్పు ఇవ్వబడి విజేతలైన వారికి మొత్తం 270 బహుమతులను అందిస్తుంది. ఈ ముగింపు వేడుక ఏప్రిల్ 15 వ తేదీన జరుగనున్నట్లు నిర్వాహకులు అల్ తొరిఫ్య్ తెలిపారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









