ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెల ఉత్సవం.. 2 మిలియన్ సందర్శకుల రాక
- March 23, 2017
రియాద్ కు ఈశాన్య వైపున120 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుమాహ్ లో మంగళవారం ఒక ఆహ్లాదకరమైన నులివెచ్చని వాతావరణంతో కింగ్ అబ్దుల్ అజిజ్ ఒంటెల ఉత్సవం ప్రారంభమై సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. 28 రోజుల పాటు జరిగే ఈ ఒంటెల పండుగని చూసేందుకు వచ్చేవారి సంఖ్య ఈ ఏడాది అధికంగా ఉండొచ్చని ఉత్సవ నిర్వాహకుల అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం 2 మిలియన్లకు పైగా సందర్శకులు ఈ ఉత్సవంకు వస్తారని భావిస్తున్నారు.వివిధ గల్ఫ్ దేశాల నుంచి 1,390 మంది ఒంటెల యజమానులు ఈ పోటీలో పాల్గొనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమంగా అభివర్ణించవచ్చని ఈ పండుగ యొక్క ప్రతినిధి డాక్టర్ తలాల్ బిన్ ఖాలిద్ అల్ తొరిఫ్య్ చెప్పారు. పురాతన సాంప్రాయాదాయక వారసత్వం గూర్చి కొత్త తరాల వారికి అనుసంధానిస్తుందని సౌదీ అరేబియా విజన్ 2030 కు ఈ కార్యక్రమం ఒక ప్రేరణ మరియు ప్రతిబింబం వలె పనిచేస్తుంది, ఆ దిశలో ఈ సంవత్సరం పండుగ ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు ఈ ఏడాది పండుగ నినాదం " ఒంటెలు నాగరికత కల్గి ఉన్నాయి." ఈ ఒంటెల పోటీలో జాతి మరియు రంగుతో సహా ఐదు రకాల వివిధ తరగతులలో న్యాయమైన తీర్పు ఇవ్వబడి విజేతలైన వారికి మొత్తం 270 బహుమతులను అందిస్తుంది. ఈ ముగింపు వేడుక ఏప్రిల్ 15 వ తేదీన జరుగనున్నట్లు నిర్వాహకులు అల్ తొరిఫ్య్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







