ఖతార్లో ప్రియం కానున్న ఆల్కహాల్
- March 23, 2017
ఖతార్లో మద్యం ప్రియులు కోటా ప్రకారమే మద్యం కొనుగోళ్ళు చేయాల్సి ఉంటుంది. అలాగే అమ్మకందార్లు కూడా పరిమిత సంఖ్యలోనే మద్యాన్ని అమ్మకాల కోసం సిద్ధం చేయాల్సి ఉంటుంది. మద్యం ప్రియులు వారి జీతానికి సంబంధించిన లెక్కలకు అనుగుణంగా మద్యం కొనుగోలు చేసేందుకు కోటా విధించారు. రమదాన్ సందర్భంగా ఈ కోటాని మూడింతలు చేయనున్నారు. అలాగే మద్యం అమ్మకాలపై పన్నుని భారీగా విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. జిసిసి దేశాలు సంయుక్తంగా ఈ ట్యాక్స్పై ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇంకో వైపున జిసిసి దేశాలు సంయుక్తంగా అమలు చేయనున్న వ్యాట్ కూడా మద్యం ప్రియులకు చేదు అనుభవాన్ని మిగల్చనుంది. 2018 నుంచి అమల్లోకి వచ్చే ఈ వ్యాట్ ద్వారా లభించే ఆదాయాన్ని వివిధ రంగాలకు మళ్ళిస్తారు. అయితే ఎడ్యుకేషన్, హెల్త్కేర్, సోషల్ సర్వీస్ వంటి రంగాలకు ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!







