తీవ్రవాదం కేసులో ముగ్గురికి మరణ శిక్ష

- March 23, 2017 , by Maagulf
తీవ్రవాదం కేసులో ముగ్గురికి మరణ శిక్ష

బహ్రెయినీ న్యాయస్తానం ముగ్గురు షియా వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను వీరికి ఈ శిక్ష విధించడం జరిగింది. 2014 బాంబు దాడులతో వీరికి సంబంధం ఉంది. ఇదే కేసులో 14 మందికి 10 ఏళ్ళ నుంచి జీవిత కాల శిక్ష వరకు విధించారు. పేలుడు పదార్థాల్ని కలిగి వుండడం, వాటితో దాడులు చేయడం, వంటి నేరాభియోగాలు వీరిపై మోపబడ్డాయి. పెద్ద సంఖ్యలో సామాన్యుల్ని తీవ్రవాదం వైపుకు తీసుకెళ్ళేందుకు వీరు ప్రయత్నించారు. జనవరిలో బహ్రెయిన్‌, ముగ్గురు షియా వ్యక్తులకు మరణ శిక్షను అమలు చేసింది. ముగ్గురు పోలీసుల్ని హత్య చేసిన కేసులో దోషులకు మరణ శిక్ష అమలు చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com