ఐపీఎల్-10 సీజన్ విక్రయానికి హైదరాబాద్ ఐపీఎల్ టిక్కెట్లు
- March 24, 2017
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్-10 సీజన్ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ముంబయి, బెంగళూరు తదితర జట్లు సొంతగడ్డపై జరిగే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనూ అభిమానుల కోసం టిక్కెట్ల పంపిణీ మొదలు పెట్టేశారు. స్టేడియంతో పాటు ఎంపిక చేసిన కొన్ని దుకాణాల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రారంభ వేడుకలకు సంబంధించిన టిక్కెట్లను మాత్రం ఇప్పటి వరకూ ఏ జట్టు అందుబాటులోకి తీసుకురాలేదు. హైదరాబాద్లో జరిగే 7 మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం మార్చి 25 నుంచి సొంతగడ్డపై జరిగే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4న ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఉప్పల్ మైదానంలో జరగనున్నాయి. తర్వాతి రోజు ఉప్పల్ మైదానంలో జరిగే తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









