ఐపీఎల్-10 సీజన్ విక్రయానికి హైదరాబాద్ ఐపీఎల్ టిక్కెట్లు
- March 24, 2017
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్-10 సీజన్ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ముంబయి, బెంగళూరు తదితర జట్లు సొంతగడ్డపై జరిగే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనూ అభిమానుల కోసం టిక్కెట్ల పంపిణీ మొదలు పెట్టేశారు. స్టేడియంతో పాటు ఎంపిక చేసిన కొన్ని దుకాణాల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రారంభ వేడుకలకు సంబంధించిన టిక్కెట్లను మాత్రం ఇప్పటి వరకూ ఏ జట్టు అందుబాటులోకి తీసుకురాలేదు. హైదరాబాద్లో జరిగే 7 మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం మార్చి 25 నుంచి సొంతగడ్డపై జరిగే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4న ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఉప్పల్ మైదానంలో జరగనున్నాయి. తర్వాతి రోజు ఉప్పల్ మైదానంలో జరిగే తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









