ఐపీఎల్-10 సీజన్ విక్రయానికి హైదరాబాద్ ఐపీఎల్ టిక్కెట్లు
- March 24, 2017అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్-10 సీజన్ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ముంబయి, బెంగళూరు తదితర జట్లు సొంతగడ్డపై జరిగే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనూ అభిమానుల కోసం టిక్కెట్ల పంపిణీ మొదలు పెట్టేశారు. స్టేడియంతో పాటు ఎంపిక చేసిన కొన్ని దుకాణాల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రారంభ వేడుకలకు సంబంధించిన టిక్కెట్లను మాత్రం ఇప్పటి వరకూ ఏ జట్టు అందుబాటులోకి తీసుకురాలేదు. హైదరాబాద్లో జరిగే 7 మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం మార్చి 25 నుంచి సొంతగడ్డపై జరిగే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4న ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఉప్పల్ మైదానంలో జరగనున్నాయి. తర్వాతి రోజు ఉప్పల్ మైదానంలో జరిగే తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..