అగ్నికి స్వల్పంగా ఆహుతైన పాడుబడిన భవనం
- March 25, 2017
స్థానిక గుదైబియాలో ఒక పాడుబడిన భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. సాధారణంగా ఈ భవంతిని స్థానికులు కాపిటల్ కువైట్ బిల్డింగ్ అని పిలుస్తారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరకి గాయాలు కాలేదని తెలుస్తుంది.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో అగ్నికీలలు ఆ భవనంని అకస్మాత్తుగా వ్యాపించాయి. వేణు వెంటనే సివిల్ డిఫెన్స్ కు చెందిన అగ్నిమాపకదళం సభ్యులు గుదైబియా లోని "కువైట్ బిల్డింగ్" వద్దకు వేగంగా సన్నివేశ స్ధలానికి చేరుకొని ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపులోనికి తెచ్చారు. సివిల్ డిఫెన్స్ లో గుదైబియా ఒక భవనంలో అగ్నికి నాశనమైందని పోలీసులు సన్నివేశం స్ధలానికి చేరుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంఘటన గూర్చి ధ్రువీకరించారు.ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి ఎలాంటి గాయాలు కాలేదని నివేదించారు.ఈ వారం ఇసా టౌన్ లో సాంప్రదాయ మార్కెట్ మరియు మినా సల్మాన్ ఇండస్ట్రియల్ ఏరియా లో ఒక గిడ్డంగి వద్ద ఇటువంటి సంఘటనలు రెండుసార్లు జరగ్గా, ఇది మూడో అగ్ని ప్రమాదంగా నమోదు కాబడింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









